అహ్మదాబాద్ : గుజరాత్ కచ్ జిల్లాలోని ముంద్రా పోర్ట్ సమీపంలోని ఓ కంటైనర్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సుమారు 56 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకుంది. పట్టుకున్న కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ500 కోట్లకుపైగా ఉంటుందని ఓ అధికారి తెలిపారు. పక్కాగా అందిన సమాచారం మేరకు డీఆర్ఐ అధికారుల బృందం కొంతకాలంగా క్రితం విదేశీల నుంచి ముంద్రా పోర్ట్కు వచ్చిన కంటైనర్లలో తనిఖీలు నిర్వహించి, పట్టుకున్నారు.
ఇంతకు ముందు జిల్లాలోని కాండ్లా పోర్ట్ సమీపంలోని కంటైనర్ స్టేషన్లో డీఆర్ఐ అధికారులు దాడులు జరిపి రూ.1300కోట్ల విలువైన 260 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్, అక్టోబర్ 2021 మధ్య ఇరాన్ నుంచి కాండ్లా పోర్ట్కు వచ్చిన 17 కంటైనర్లలో మాదక ద్రవ్యాలు సరఫరా చేసినట్లు గుర్తించారు. ఇటీవల గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా అమ్రేలి జిల్లాలోని పిపావావ్ పోర్ట్ వద్ద షిప్పింగ్ కంటైనర్ నుంచి రూ.450కోట్ల విలువైన 90 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నాయి.