చండీఘడ్: లుథియానాలో దారుణం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు.. తొలుత డివైడర్ను ఢీకొని, ఆ తర్వాత విద్యుత్తు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృతిచెందారు. మృతిచెందిన వారిలో రాజేశ్, సంజన, మహి, కుషి, జాస్మిన్ ఉన్నారు. రాజేశ్ భార్య ప్రియా ప్రస్తుతం క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతోంది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. తెల్లవారుజామున 2.45 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. చండీఘడ్ రోడ్డులోని ఫోర్టిస్ హాస్పిటల్ వద్ద కారు తొలుత డివైడర్ను ఢీకొని ఆ తర్వాత విద్యుత్తు పోల్ను ఢీకొట్టింది.