న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో ఇవాళ 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో జమ్మూకశ్మీర్తో పాటు ఢిల్లీలోనూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్-తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సుమారు 20 సెకన్ల పాటు భూమి కంపించినట్లు కొందరు ట్వీట్ చేశారు. ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఆఫ్ఘన్-తజకిస్తాన్ బోర్డర్లో 9.45 నిమిషాలకు భూకంపం నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ తెలిపింది. 181 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు సెంటర్ పేర్కొన్నది.