బొకారో, నవంబర్ 29: ఓ బొగ్గుగనిలో చిక్కుకున్న నలుగురు.. బయటకి వచ్చేందుకు మార్గం కోసం దాదాపు 20 గంటల పాటు తవ్వి విజయవంతంగా బయటపడ్డారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలోని పర్బత్పూర్ కోల్ బ్లాక్లో చోటుచేసుకుంది. చందన్కియారి పరిధిలోని తిలతండ్కి చెందిన ఆరుగురు శుక్రవారం భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్కి చెందిన మూసివేసిన ఓ బొగ్గుగనిలో అక్రమ తవ్వకాల కోసం దిగా రు. ఈ సమయంలో గనిలోకి ఓ వైపు భాగం కూలడంతో ఇద్దరు బయటకు రాగా, మిగతా నలుగురు చిక్కుకుపోయారు. వారి ఆచూకీ కనుగొనడంలో జిల్లా యంత్రాంగం విఫలమవడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆదివారం రం గంలోకి దిగారు. అయితే దాదాపు 20 గంటల పాటు శ్రమించి మార్గాన్ని కనుగొన్న ఆ నలుగురే సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమ యంలో బయటకు వచ్చారని జిల్లా ఎస్పీ చందన్కుమార్ తెలిపారు.