పోర్ట్బ్లెయిర్ : అండమాన్, నికోబార్ దీపంలో గురువారం భూకంపం సంభవించింది. ఉదయం 1.04 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూపంకం పోర్బ్లెయిర్కు తూర్పున 97 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. రాత్రిపూట ప్రకంపనలు రావడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికార వర్గాలు తెలిపాయి.
ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధర రూ.750!
దంచికొట్టిన ఎండలు.. అత్యంత వేడి సంవత్సరం 2020
రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం