నల్లగొండ ప్రతినిధి, మార్చి 30 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డితోపాటు నియోజకవర్గ ముఖ్య నేతలతో కలిసి నాలుగు సెట్లను నిడమనూరు తాసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రోహిత్సింగ్కు అందజేశారు. అంతకుముందు నిడమనూరులోని టీఆర్ఎస్ కార్యాలయం నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, నోముల నర్సింహయ్య సతీమణి లక్ష్మితోపాటు నియోజకవర్గ ముఖ్య నేతలంతా భగత్ వెంట తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. సాగర్ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారని, భగత్ భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని చెప్పారు. జానారెడ్డి ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆయన మాటలు తేటతెల్లం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మాట్లాడుతూ.. ‘నన్ను ఆశీర్వదించేందుకు మా నాన్న లేరు.. ఇక్కడి ప్రజలే నాకు తండ్రిలాంటి వాళ్లు.. మీరందరూ ఆశీర్వదించి గెలిపించాలి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి భగత్కుమార్తోపాటు కాంగ్రెస్ తరఫున జానారెడ్డి, బీజేపీ అభ్యర్థి డాక్టర్ రవికుమార్, టీడీపీ అభ్యర్థి మువ్వా అరుణ్కుమా ర్ నామినేషన్లు వేశారు. వీరితో పాటు చివరి రోజు మొత్తం 58 మంది అభ్యర్థులు 105 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించినట్టు రిటర్నింగ్ అధికారి రోహిత్సింగ్ వెల్లడించారు. అంతకుముందు నాలుగు రోజుల్లో కలిపి 20 మం ది అభ్యర్థులు 28 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నాటి నామినేషన్లతో కలిపి మొత్తం 78 మంది అభ్యర్థులు 128 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. నిర్ణీత సమయం మధ్యా హ్నం 3 గంటలలోపు అభ్యర్థులు ఆర్వో కార్యాలయానికి చేరుకోవడంతో 48 మందికి టోకెన్లు జారీచేసి సాయం త్రం 6 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు.