చోడవరం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో పోలీసులు సుమారు మూడు వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఆ గంజాయి విలువ సుమారు 80 లక్షలు ఉంటుంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంతో సరిహద్దు ఉన్న మల్కన్గిరి, కోరాపుట్ నుంచి గంజాయి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రూరల్ ఎస్పీ బీ కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ కేసులో ఓ వ్యక్తిని, ట్రక్కు డ్రైవర్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. కొరియర్గా డ్రైవర్ వ్యవహరించినట్లు ఎస్పీ వెల్లడించారు. కొరియర్ అరెస్టు కావడంతో ఆ గంజాయి కోసం తునిలో ఎదురుచూస్తున్న వ్యక్తి పరారీ అయినట్లు తెలిపారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఏజెన్సీలో గంజాయిని అధిక శాతం పండిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రాంతం నుంచే ఎక్కువ శాతం గంజాయి బెంగుళూరుకు స్మగ్లింగ్ అవుతున్నట్లు ఆయన వెల్లడించారు.