న్యూఢిల్లీ : సరిహద్దు రేఖ వెంబడి గత మూడు నెలలుగా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అన్నారు. పాకిస్తాన్ వైపు నుంచి కాల్పుల విరమణ తర్వాత ఎల్ఓసీ వెంట ప్రశాంతత నెలకొన్నదని చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరవణె పలు విషయాలు వెల్లడించారు. ఆయన ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్య అంశాలు ఆయన మాటల్లోనే..
చాలా కాలం తర్వాత భారతదేశం-పాకిస్తాన్ మధ్య సంబంధాలలో మెరుగుదల కనిపిస్తున్నది. గత 3 నెలలుగా ఎల్ఓసీపై కాల్పులు జరుగలేదు. ఇరు దేశాల మధ్య సంబంధాన్ని మెరుగుపర్చడానికి ఇది మొదటి మెట్టు. సరిహద్దులో చొరబాట్లు, ఉగ్రవాద సంఘటనలను తగ్గించడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి.
జమ్ముకశ్మీర్లో గత ఏడాదిలో హింసాకాండ కేసులు గణనీయంగా తగ్గాయి. ఉగ్రవాదులపై నిరంతరం దృష్టి పెడుతున్నాం. సెర్చ్ ఆపరేషన్ను కఠినంగా అమలు చేస్తున్నాం. బయటి నుంచి ఆయుధాలు సరఫరా కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం.
గతంలో కశ్మీర్ యువత పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడేవారు. వీటిపై నిరంతరం నిఘా ఉంచాం, వీటి బారిన పడకుండా యువతను రక్షించాం. ఇక్కడి యువత ప్రతిభావంతులు. చాలా మంది యువకులు క్రీడలు, విద్యలో ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. స్థానిక యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరే సంఘటనలు బాగా తగ్గాయి. కశ్మీర్ సామాన్యులు శాంతిని కోరుకుంటున్నారు.
జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాను భారత్ తొలగించినప్పటి నుంచి దీనిని పాకిస్తాన్ అంతర్జాతీయ సమస్యగా మార్చడానికి ప్రయత్నించింది, అయితే, అది విజయవంతం కాలేదు. ఉగ్రవాద రహిత వాతావరణం కావాలని పాకిస్థాన్కు స్పష్టం చేశాం.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తన సైనిక దళాలను ఉపసంహరించుకోవడంపై ఆందోళనగా ఉన్నది. రానున్న రోజుల్లో తాలిబాన్లు గతంలో మాదిరిగా రెచ్చిపోరని గ్యారంటీ ఏదీ లేదు. పూర్తిగా శాంతి నెలకొనేంత వరకు అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో ఉంటే బాగుండేదని ఎంఎం నరవణె అభిప్రాయపడ్డారు.
వానాకాలం కరోనా వైరస్తో జాగ్రత్త.. ఇవి పాటించండి..!
ఎల్లుండి నుంచి ఎంపీలో అన్లాక్ : మార్గదర్శకాలు వెల్లడి
ఆరేండ్ల క్రితం కేసులో హైకోర్టు తీర్పు.. ధర్మసంకటంలో పినరాయి ప్రభుత్వం
తొలి హిందీ వార్తాపత్రిక ప్రారంభం.. చరిత్రలో ఈరోజు
చైనాలో కలవరపెడుతున్న కొత్త రకం స్ట్రెయిన్
లెఫ్టినెంట్గా బాధ్యతలు చేపట్టిన పుల్వామా వీరుడి సతీమణి
2021 సెషన్ కోసం ఆన్లైన్ కోర్సులను ప్రారంభించిన యూజీసీ
వ్యాక్సిన్ వేసుకుంది.. లాటరీ కొట్టేసింది..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..