భోపాల్, జూన్ 17: ఎంపీ అభిషేక్ బెనర్జీ అరెస్ట్పై విధించిన మధ్యంతర స్టేను మధ్యప్రదేశ్ హైకోర్టు తొలగించింది. దీంతో అతడిని అరెస్ట్ చేయవయవచ్చని తెలుసున్నది. మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నేత ఆకాశ్ విజయ్ వర్గీయ ఒక గూండా అంటూ 2020లో ఒక సభలో అభిషేక్ విమర్శించారు.
దీంతో ఆకాశ్ కోర్టులో కేసు దాఖలు చేశారు. కేసు విచారణకు అభిషేక్ బెనర్జీ గైర్హాజరు కావడంతో న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతడు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా, అరెస్ట్పై తాత్కాలికంగా స్టే విధించింది.