తిరువనంతపురం, జూన్ 17: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణను ఈడీ అధికారులు బుధవారం విచారించారు. ఒక వివాదాస్పద మైనింగ్ సంస్థ నుంచి ఆమె సంస్థకు అనుమానాస్పదంగా పెద్దమొత్తంలో డబ్బు అందిన ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది.
వీణా ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమెను సాయంత్రం వరకు విచారించిన అధికారులు పలు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఈడీ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.