న్యూఢిల్లీ: రానున్న 15 రోజుల్లో నిత్యం 3 లక్షల రెమ్డెసివిర్ ఇంజెక్షన్ డోసులను ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు అందుబాటులో ఉన్న ఇంజెక్షన్లు బ్లాక్మార్కెట్కు తరలడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రెమ్డెసివిర్ కొరత గురించి పలు రాష్ట్రాలు నివేదించడంతో రెండు వారాల్లోనే 3 లక్షల రెమ్డెసివిర్ ఔషధాన్ని బహిరంగ మార్కెట్కు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి మన్సుఖ్ మండవీయ తెలిపారు. ప్రస్తుతం 1.5 లక్షల మోతాదులను సరఫరా చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఈ
యాంటీ-వైరల్ ఔషధ ప్రమాణాల ఉత్పత్తి వీలైనంత త్వరగా పెరిగేలా, దాని ధరలను తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఏడు ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న రెమ్డెసివిర్ మందుపై 50 శాతం ధరలను కేంద్రం తగ్గించిందని తెలిపారు.
1,50,000 వయల్స్ కోసం రెమ్డెసివిర్ ఉత్పత్తి ఆదివారం నుంచి ప్రారంభమైందని, రాబోయే 15 రోజుల్లో ఉత్పత్తి రెట్టింపు అవుతుందన్నారు. 15 రోజుల తర్వాత నిత్యం 3 లక్షల వయల్స్ మార్కెట్లో లభిస్తాయి అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం 20 ప్లాంట్లు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను ఉత్పత్తి చేస్తున్నాయని, ఈ ఇంజెక్షన్ ఉత్పత్తికి మరో 20 ప్లాంట్లలను భారత ప్రభుత్వం ఆమోదించిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరింత ఎక్కువ రెమ్డెసివిర్ ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్
పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు
గ్రహాంతరవాసులతో పరిచయానికి దగ్గరికొస్తున్న మానవుడు..!?
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్ఖాన్
రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు
స్పేస్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన వ్యోమగామి కేట్ రూబిన్స్
మేధోసంపత్తి అడ్డంకులు తొలగించండి.. బైడెన్కు ఎంపీల వినతి
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
జూన్ 1 నుంచి హాల్మార్క్ నగలే అమ్మాలి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..