న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారీ ప్రణాళికను ప్రకటించింది. వచ్చే ఆరు నెలల్లో మూడు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టబోతున్నది. వచ్చే నెలలో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఐఎక్స్ను విడుదల చేయనున్న సంస్థ..ఆ తర్వాత మూడు నెలల్లో ఎలక్ట్రిక్ మినీ లగ్జరీ హ్యాచ్బ్యాక్ను, ఆ తర్వాత బీఎండబ్ల్యూ ఐ4ని విడుదల చేయనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వీటిలో కేవలం 6.1 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఐఎక్స్ మోడల్ కూడా ఉన్నది.