రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలు, నక్సల్స్కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఇద్దరు మహిళా నక్సల్స్ హతమయ్యారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. కాటే కల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొర్లి – ముతేలి గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల సంయుక్త బృందం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయని బస్తర్రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పేర్కొన్నారు. కాల్పుల్లో కాటే కల్యాణ్ ఏరియా దంతెవాడ, సుక్మా జిల్లాల పరిధిలోని ఉన్న గ్రామాల్లో మావోయిస్టుల సంచారంపై పక్కా సమాచారం అందడంతో డీజీఆర్, సీఆర్ఎఫ్ 230వ బెటాలియన్, సీఎఆపీఎఫ్ స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
ఈ క్రమంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో గొర్లి – ముతేలి గ్రామాల మధ్య కాల్పులు బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయని ఐజీ తెలిపారు. కాల్పుల తర్వాత సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. ఇద్దరు మహిళా నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు రెండు 12 బోర్ రైఫిల్స్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. మృతుల్లో ఒకరిని ఎల్ఓఎస్ కమాండర్ మంజుల, మరొకరు ప్రొటెక్షన్ టీం సభ్యురాలు గంగి పూనెంగా ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఆపరేషన్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, ప్రస్తుతం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని
వివరించారు.