శ్రీనగర్: భారత భూభాగంలోకి ప్రవేశించిన ఇద్దరు పాకిస్థానీలను ఇండియన్ ఆర్మీ స్వదేశానికి అప్పగించింది. పాకిస్థాన్కు చెందిన ఇద్దరు పౌరులు శనివారం పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దును దాటారు. గుర్తించిన బీఎస్ఎఫ్ దళాలు వారిని అరెస్టు చేశాయి. తాము పొరపాటున సరిహద్దును దాటి భారత్లోకి ప్రవేశించామని విచారణలో తేలింది. దీంతో మానవతా దృక్పదంతో వారిని స్వదేశానికి పంపించామని బీఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ అధికారులు వెల్లడించారు. వారిని పాక్ రేంజర్లకు అప్పగించామని తెలిపారు. గతంలో కూడా ఇద్దరు పాక్ ఆక్రమిత కశ్మీర్కు చెందిన పౌరులు భారత్లోకి ప్రవేశించడంతో వారిని ఇండియన్ ఆర్మీ అక్కడి అధికారులకు అప్పగించింది.