భూత్పూర్, అక్టోబర్ 13 : అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అభివృద్ధిని చూసే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. శుక్రవారం అన్నాసాగర్లోని ఎమ్మె ల్యే నివాసంలో చిన్నచింతకుంట మండలం కురుమూర్తి గ్రామానికి చెందిన 100 మంది, మున్సిపాలిటీ కేంద్రంలోని మాల కులస్తులు 30మంది, అదేవిధంగా తాటిపర్తికి చెందిన మైనార్టీలు 30మంది కా్ంరగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. అభివృద్దిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స త్తూర్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీలు కదిరె శేఖర్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీలు రాజశేఖర్రెడ్డి, ఇంద్రయ్యసాగర్, మండలాధ్యక్షుడు రాము, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, బాలకోటి తదితరులు పాల్గొన్నారు.