న్యూఢిల్లీ : మే 7న జరగబోయే మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో 12 రాష్ర్టాలు, యూటీల నుంచి 95 సీట్లలో 1,351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఇందులో ఎంపీలోని బీతుల్ నియోజకవర్గ ఎన్నిక కూడా ఉందని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది.
సూరత్ నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీంగా ఎన్నికైనట్టు ఈసీ తెలిపింది. మూడో విడత ఎన్నికకు 2,963 నామినేషన్లు దాఖలు కాగా, అందులో 1563 సక్రమంగా ఉన్నట్టు ధ్రువీకరించారు. గుజరాత్లోని 26 లోక్సభ స్థానాలకు 658, మహారాష్ట్రలోని 11 సీట్లకు 519, మహారాష్ట్రలోని ఉస్మాన్బాద్లో అత్యధికంగా 77 మంది, ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో 68మంది నామినేషన్లు వేశారు.