జడ్చర్లటౌన్, అక్టోబర్ 25: పార్టీ అభ్యున్నతి కోసం పనిచేసే ప్రతికార్యకర్తను పార్టీ గుర్తిస్తోందని, రానున్న 35రోజులు చాలా కీలకమన్నారు. వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీ సాధించే దిశగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలోని నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు.
యూత్ కాంగ్రెస్ నాయకులు సరాఫ్అలీ, నవీద్, ఆరీఫ్తోపాటు 120 మంది కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 9ఏండ్లలో జడ్చర్లను అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వెంట పనిచేసేందుకు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నామని, హ్యాట్రిక్ విజయంలో పాలుపంచుకుంటామని పార్టీలో కొత్తగా చేరిన నాయకులు తెలిపారు.