పాట్నా: బీహార్లోని వైశాలి జిల్లాలో 120 మంది ప్రసాదం తిని అస్వస్థతతకు గురయ్యారు. సత్యనారాయణ పూజలో ఇచ్చిన ప్రసాదం స్వీకరించినవాళ్లు కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో ఇబ్బందిపడ్డారు.పాతేపూర్ బ్లాక్లో ఉన్న మహతి ధర్మచంద్ పంచాయత్ వార్డు నెంబర్ 10లో ఈ ఘటన జరిగింది. వైశాలి సివిల్ సర్జన్ డాక్టర్ అమితాబ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. వార్డు నెంబర్ 10లో ఆహారం కలుషితమైందని, వాళ్లకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఇచ్చామని, అవసరమైన మందుల్ని సరఫరా చేశామని, అయిదుగురు బాధితుల ఆరోగ్యం క్షీణించిందని, వాళ్లను పతేపూర్ హెల్త్ సెంటర్కు తీసుకువెళ్లినట్లు తెలిపారు. ప్రసాదం కోసం వినియోగించిన అరటి పండ్లలో అధిక స్థాయిలో కెమికల్ వాడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అరడి పండ్లను ఉడకబెట్టడం వల్ల కూడా ప్రసాదం కలుషితమైనట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.