న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు వెయ్యికి తగ్గాయి. కొత్తగా 1096 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,24,93,773 మంది కోలుకున్నారు. 5,21,345 మంది మరణించారు. మరో 13,013 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 81 మంది మహమ్మారికి బలయ్యారని, 1447 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.03 శాతం మాత్రమేనని, ఇప్పటివరకు 98.76 శాతం మంది డిశ్చార్జీ అయ్యారని, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇక దేశవ్యాప్తంగా 1,84,66,86,260 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, శనివారం ఒక్కరోజే 12,75,495 మందికి టీకా తీసుకున్నారని తెలిపింది.