న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) చార్జీలను మంగళవారం నుంచి పెంచనుంది. బ్యాంకు బ్రాంచీలో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి చార్జీ విధించనుంది. ఐఎంపీఎస్ లావాదేవీలు చేసేటప్పుడు జీఎస్టీతో కలిపి గరిష్ఠంగా రూ.20 చార్జీ రూపంలో వసూలు చేయనుంది. అయితే ఇంటర్నెట్ ద్వారా చేసే ఐఎంపీఎస్కు చార్జీలు ఉండబోవన్నది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో అకౌంట్ ఉన్నవాళ్లు తమ ఖాతాలో డబ్బులు లేక ఈఎంఐ చెల్లింపు ఫెయిల్ అయితే ఖాతాదారుడి నుంచి సదరు బ్యాంకు రూ.250 వసూలు చేయనుంది. ఈ నిబంధన వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన చెక్ క్లియరెన్స్ నియమ నిబంధనలు కూడా మారనున్నాయి.