హైదరాబాద్ : నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ సందర్భంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఏవైనా ఫిర్యాదులుంటే కాల్ సెంటర్ నంబర్ 040-21111111 నంబరులో సంప్రదించాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వరద తొలగింపునకు సిద్ధంగా సిబ్బందిని ఆదేశించారు. అలాగే కంట్రోల్ రూమ్లోనూ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమవగా.. వాహనదారులు, జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.