సూర్యాపేట, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల తర్వాత హుజూర్నగర్ నియోజకవర్గంలో రాజకీయంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ తరఫున శాసన సభ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేస్తూ ఇటీవల బీజేపీలో చేరారు. కానీ ఆయన వెంట ఒక్క నాయకుడుగానీ, కార్యకర్త గానీ వెళ్లలేదు. అంతా గులాబీ పార్టీలోనే ఉన్నారు. దాంతో శానంపూడి బీఆర్ఎస్ శ్రేణులకు ఫోన్లు చేస్తూ తన వెంట రావాలని బతిమాలుతున్నారు. ‘నీ దారి నీవు చూసుకున్నావు.. మా దారి గులాబీ దారి’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు కరాఖండిగా చెబుతున్నారు.
బీజేపీలో చేరిన సైదిరెడ్డికి నల్లగొండ ఎంపీ టికెట్ ఖరారు చేసి పదిరోజులు గడుస్తున్నప్పటికీ ఆయన వెంట ఓ నాయకుడుగానీ, కార్యకర్తగానీ లేకపోవడంతో ఏకాకిగా మిగిలిపోయారు. జిల్లాలో ఉన్న బీజేపీ నాయకులు సైతం సైదిరెడ్డిని కలువకపోవడం, సైదిరెడ్డి బీజేపీ నాయకులను సంప్రదించకపోవడం కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో సైదిరెడ్డికి నల్లగొండ ఎంపీ అభ్యర్థిత్వానికి బీజేపీ నుంచి ఏ మేరకు మద్దతు లభిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
అంతే కాకుండా నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మఠంపల్లి మండలంలో భూములు కబ్జా చేశారంటూ అక్కడ ఉన్న ఫెన్సింగ్లను తొలగించడంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఓ యుద్ధమే జరిగింది. నాడు బీజేపీ నాయకులపై కేసులు కాగా దానికి కారణమైన సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం పట్ల జిల్లా బీజేపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ పార్టీ అధిష్టానంపై అసహనంతో ఉన్నారు. చూడాల్సిందే.
ఇటీవల మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి హుజూర్నగర్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి భరోసా కల్పించారు. గ్రామాల వారీగా పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. మూడు నెలల వరకు నియోజకవర్గాన్ని తానే చూసుకుంటానని, ఎవరూ ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. 2009 ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా జగదీశ్రెడ్డి బరిలో ఉండగా నాటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. 2014, 2018తోపాటు ఇటీవల 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకోసం వారు ఎంతో కష్టపడ్డారు. గత ఎన్నికల్లో ఉత్తమ్కుమార్రెడ్డి తానే సీఎం అభ్యర్థిని అని ప్రచారం చేసుకున్నా అంత మెజార్టీ రాలేదు.
తాము ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్వాదులుగానే ఉంటామని, పార్టీకి సహకరిస్తామని నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. సైదిరెడ్డి ఫోన్లు చేసినా బీజేపీలోకి వెళ్లేది లేదని, త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీ మెజారిటీ వచ్చేలా పని చేస్తామని ముక్తకంఠంతో చెబుతున్నారు. బీఆర్ఎస్లో సుమారు 60వేల మంది కేడర్ ఉంటే అందరినీ వీడి బీజేపీలో చేరి నలుగురు కూడా లేకుండా సైదిరెడ్డి ఏకాకయ్యాడని బీఆర్ఎస్ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లా బీజేపీలో తొంభైశాతం సైదిరెడ్డిని వ్యతిరేకిస్తూ నల్లగొండ ఎంపీ అభ్యర్థిత్వాన్ని మార్చాలని అధిష్టానం వద్ద పట్టుబడుతున్నట్లు తెలుస్తుండగా అభ్యర్థిత్వాన్ని కూడా మార్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మరికొన్ని రోజుల్లో ఏం జరుగుతుందనేది వేచి