జవహర్నగర్, నవంబర్ 12 : పేద పిల్లల విద్య కోసం స్వేచ్ఛా వేదిక చేస్తున్న సేవలు అభినందనీయమని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్గుప్తా అన్నారు. శుక్రవారం చెన్నాపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కార్పొరేటర్ బింగి లావణ్య సతీశ్గౌడ్ ఆధ్వర్యంలో స్వేచ్ఛ వేదిక సొసైటీ 62 మంది పేద విద్యార్థులకు ఉచితంగా బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ కావ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పేద విద్యార్థులకు సేవ చేయాలని, స్వేచ్ఛా వేదిక సొసైటీ సేవలు అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వేణు, రవి, సతీశ్కుమార్, లక్ష్మీకృష్ణగౌడ్, సాయికుమార్, రాంచందర్, కోఆప్షన్మెంబర్ ఫారూక్, వర్కింగ్ ప్రెసిడెంట్ సాధిక్, నాయకులు వెంకన్న, సంస్థ ప్రతినిధులు రాజు, సాయి, భాషా, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.