హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో 495 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్) అధికారులు తెలిపారు. గురువారం దుబాయి ప్రయాణికుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫేసియల్ క్రీమ్ బాక్సు, శాండిల్స్లో బంగారం ఉన్నట్లు గుర్తించామని ఎయిర్పోర్టు అధికారులు పేర్కొన్నారు.