నిజామాబాద్, జనవరి 27 : రైతులను ఉగ్రవాదులతో పోల్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి ఘటనలో రైతుల చేతిలో గాయపడిన తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు గురువారం ఆయన నందిపేటకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన కర్షకులను ఖలిస్థాన్ ఉగ్రవాదులతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పంజాబ్లో ప్రధానమంత్రి మోదీపై దాడిచేసిం ది రైతులు కాదు మేమేనం టూ ఖలిస్థాన్ ఉగ్రవాదులు ప్రకటించారు. అర్వింద్ మీద దాడితో మాకు సంబంధం లేదని టీఆర్ఎస్ అంటున్నది. అంటే రైతులకు ఖలిస్థాన్ ఉగ్రవాదులకు ఏమై నా సంబంధమున్నదా?’ అని బండి సంజయ్ మీడి యా సమావేశంలో అన్నారు. అంతకుముందు ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడుపుమండిన రైతులు నిరసనకు దిగితే ఖలిస్థాన్ ఉగ్రవాదులతో పోలుస్తారా? అంటూ రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.