తెలంగాణ అస్తే ఏమొస్తది? గీ కొట్లాటలెందుకు అని అన్నరు అప్పుడు! కానీ ఇప్పుడు సూడుండ్రి.. కన్నీరు కారిన చోటే గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. కాలే ఎండల్లో కూడా గోదారమ్మ పొంగి పొర్లుతోంది.. బీడు బారిన పొలాలను కాళేశ్వరం జలాలు తడుపుతున్నాయి. ఏప్రిల్ నెలలో సూరీడు సుర్రుమంటున్న కూడా చెరువులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. ఇదే విషయాన్ని గుర్తు చేసిన మంత్రి కేటీఆర్.. పొంగిపొర్లుతున్న ముస్తాబాద్ చెరువు ఫొటోలను ట్వీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గోదారి జలాలు వచ్చె.. రైతన్న మురిసె..