ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎంతగానో కష్టపడ్డారు. కరెంట్ కోతలు, అప్పుల బాధలతో దినమొక గండంలా బతికారు. రైతులు పడుతున్న ఇబ్బందులు గమనించిన కేసీఆర్.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. రైతును రాజును చేయాలనే సంకల్పంతో రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి యావత్ దేశం తెలంగాణ వైపు చూసేలా చేశారు. రైతుల కోసం కేసీఆర్ పడుతున్న కృషిని కొనియాడుతూ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ సోషల్ మీడియా వినూత్న ప్రచారం చేపట్టింది.
హాలియా మున్సిపాలిటీ పరిధి అలీనగర్లోని ఓ రైతు పొలంలో లక్షచదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అద్భుత చిత్రాన్ని వేశారు. ట్రాక్టర్ ప్లవ్, కల్టివేటర్ సహాయంతో స్థానిక రైతులు, టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం రెండు రోజులు శ్రమించి కేసీఆర్ చిత్రం గీశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మల్లన్నా.. మొక్కులు అందుకో..
మాస్క్ పెట్టుకోమని చెప్తే వినరే..