చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ దృశ్యం ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కె గ్రామంలోనిది. ఇటు, అటు పొలాలు.. వాటి మధ్యన నున్నటి రోడ్డు.. దానికి ఇరువైపులా పచ్చని మొక్కలు. ఇవన్నీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా 2021 జూలై 24న నాటిన మొక్కలు. ఆ రోజు ఈ రోడ్డు వెంట రెండు వేల మొక్కలు నాటారు. అవన్నీ ఇప్పుడు పచ్చగా పెరుగుతూ, బాటసారులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.