హైదరాబాద్ జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ .. ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఉద్యోగాల కల్పన పైన ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటిదాకా సుమారు లక్ష 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. ఎలాగైతే ఒక్క రూపాయి ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగలిగారో అదేవిధంగా ఒక్క రూపాయి తీసుకోకుండా అత్యంత నిజాయితీతో ప్రజా సేవకి పాటుపడాలన్నారు. ఈ ఉద్యోగాన్ని ఒక సవాలుగా తీసుకొని జల మండలిని మరింత అభివృద్ధి పథాన నిలిపే విధంగా వినూత్న ఆలోచనలతో పనిచేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కన్నీరు కారిన చోటే.. గంగమ్మ పరవళ్లు..
గోదారి జలాలు వచ్చె.. రైతన్న మురిసె..