గణేశ్ నిమజ్జనం ఉత్సవంలా కొనసాగుతోంది. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్, దుర్గం చెరువు, ఉప్పల్ నల్లచెరువు సహా నగరంలోని పలు ప్రాంతాల్లో భక్తులు తీన్మార్ డ్యాన్సులతో స్టెప్పులేస్తూ వినాయకుడి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ శాంతియుతంగా గణేశ్ నిమజ్జనం జరిగేలా చూసుకుంటున్నారు.