విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లోని జంక్షన్లు ఆధునీకతను సంతరించు
కుంటున్నాయి. ఒకప్పుడు నగరం అంటే నరకప్రాయంగా ఉండేది. ఎక్కడికి వెళ్లాలన్నా ట్రాఫిక్ రద్దీ.. పర్యాటక ప్రాంతాలు, జంక్షన్లు బోసిపోయి కనిపించేవి. సమైక్య పాలకులు నగర వైభవాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక భాగ్యనగరం రూపు మార్చుతున్నది. ఎక్కడ చూసినా విశాలమైన రోడ్లు, కనువిందు చేసే జంక్షన్లతో వావ్ అనేలా తీర్చిదిద్దింది. అనేక రోడ్లను మెరిపించింది. 19 జంక్షన్లు విశాలంగా మార్చింది. తీరొక్క థీమ్తో అలంకరించింది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వ పాలనలో మారిన రోడ్లు, అభివృద్ధి చేసిన జంక్షన్ల ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో నగర వాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు.