ఈ ఫొటో చూసి ఏ ఎడారి ప్రాంతమో అనుకుంటే పొరపాటే! ఎందుకంటే ఎప్పుడు జనాలతో కళకళలాడే ముంబై బీచ్ ఇది!! కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఇటీవల లాక్డౌన్ విధించారు. దీంతో జనాలు లేక జుహు చౌపతి ప్రాంతంలోని సముద్రతీరం ఇలా వెలవెలబోతోంది.