బెంగళూర్ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అనంతరం బెంగళూర్లో తొలిసారిగా గడిచిన 24 గంటల్లో కొవిడ్-19 మరణాలు సున్నాగా నమోదయ్యాయి. ఇక 270 తాజా కేసులు నమోదవగా ఒక్కరోజులో 363 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక కర్నాటకలో గత 24 గంటల్లో మొత్తం 1151 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 1442 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 10 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కల్పోయారు.
గడిచిన 24 గంటల్లో తొమ్మిదేండ్లలోపు చిన్నారులు 9 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్దారణ కాగా, 10 నుంచి 19 ఏండ్ల మధ్య వయసువారి లో 11 మందికి కరోనా సోకింది. బెంగళూర్లో పాజిటివిటీ రేటు 0.52 శాతం కాగా, రికవరీ రేటు 98.09 శాతంగా నమోదైంది.