అహ్మదాబాద్: గుజరాత్లోని వడోదరలో (Vadodara) ఓ యువతి వీరంగం సృష్టించింది. తన బైక్పై కూర్చోవద్దన్నందుకు యువకుడిని విచక్షణా రహితంగా కొట్టింది. పచ్చి బూతులు తిడుతూ కాలుతో కడుపులో తన్నింది. పోలీసులు రావడంతో అక్కడి నుంచి ఉడాయించింది.
ఇలియాస్ యూసుఫ్భాయ్ మెమన్ అనే యువకుడు వడోదరలోని మంగల్ బజార్లో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి తన విధులు ముగించుకుని ఇంటికి తిరిగివెళ్తుండగా స్నాక్స్ తినడానికి ఓ షాప్ వద్ద ఆగాడు. బైక్ను పార్క్ చేసి తినడానికి వెళ్లాడు. తిరిగివచ్చి చూడగా తన బైక్పై ఓ యువతి కూర్చొని ఉన్నది. దీంతో తాను వెళ్లాలని, బైక్పై నుంచి దిగాలని ఆమెను కోరాడు. దానికి నిరాకరించిన ఆమె.. తన వెనుక కూర్చోవాలని చెప్పింది. బైక్ దిగాలని మరోసారి కోరడంతో ఆగ్రహానికి లోనైనా ఆ యువతి.. అతనిపై దాడికి దిగింది. గల్లా పట్టుకుని చెంపలు వాయించింది.
అంతటితో ఆగకుండా బూతులు తిడుతూ కాలుతో అతని కడుపులో పలుమార్లు తన్నింది. ఈ క్రమంలో ఆమెను పక్కకు నెట్టేయడంతో.. అక్కడున్న ఓ బండ రాయితో కొట్టడానికి యత్నించింది.. ఇదంతా అక్కడ ఉన్నవారు అడ్డుకోకపోగా చోద్యంచూస్తూ ఉండిపోయారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి రావడంతో.. ఘటనా స్థలం నుంచి ఆమె ఉడాయించింది. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు.