ముంబై, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): వన్సైడ్ లవ్తో ఒక బాలుడిని ప్రేమించిన 19 ఏండ్ల యువతి అతడితో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవడమే కాక, అతడిని కిడ్నాప్ చేసింది. ముంబైలోని మాన్ఖుర్డ్ ప్రాంతం లో ఈ ఘటన జరుగగా, ఆ బాలికపై పోలీసులు కేసు నమోదు చేశా రు. సానియా (19) అనే యువతి అదే ప్రాంతానికి చెందిన 17 ఏండ్ల బాలుడిని ప్రేమించింది.
తనను ప్రేమించమని వేధించడమే కాక, అతడిపై పలుసార్లు లైంగిక దాడి చేసింది. తనను పెండ్ల్లి చేసుకోవాలని బాలుడిని ఒత్తిడి చేస్తూనే ఉం ది. దానికతడు నిరాకరించడంతో, అతడిని చంపేస్తానని బెదిరించి చివరకు కిడ్నాప్ చేసింది. బాలుడు తప్పించుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి యువతి కోసం గాలిస్తున్నారు.