న్యూఢిల్లీ: లోక్సభలో ఇవాళ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదివరకు రాష్ట్రపతి కులం గురించిగానీ, మతం గురించిగానీ ఎక్కడా వినిపించేది కాదని, కానీ ఇప్పుడు బీజేపీ పాలనలో దేశమంతటా రాష్ట్రపతి జాతి గురించే చర్చ జరుగుతున్నదని అన్నారు.
ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన బీజేపీ.. దేశ, విదేశాల్లో ఎక్కడికెళ్లినా అదే విషయం చెప్పుకుంటున్నదని అధిర్ రంజన్ చౌధురి హేళన చేశారు. అదంతా రాజకీయ పన్నాగమని, గిరిజనుల ఓట్లు దండుకునేందుకు బీజేపీ ఆడుతున్న ఆట అని మండిపడ్డారు. మీరంతా కలిసి రాహుల్గాంధీని పప్పుగా మార్చే ప్రయత్నం చేశారని, కానీ ఆయనే మిమ్మల్ని పప్పుగా మార్చేశారని ఎద్దేవా చేశారు.