లక్నో : (Yogi decision) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ప్రోటోకాల్ ఉల్లంఘనులపై నమోదైన 3 లక్షల కేసులను ఉపసంహరించుకోనున్నారు. ఈ మేరకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్డౌన్ అమలు సమయంలో ప్రోటోకాల్ను కచ్చితంగా పాటించాలని కఠిన ఆంక్షలు విధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, అప్పడు నమోదైన కేసుల ఉపసంహరణ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభం కానున్నది. న్యాయ శాఖ జారీ చేసిన ఆదేశంలో ప్రజలపై తక్కువ తీవ్రమైన నేరాల సెక్షన్ల కింద నమోదైన కేసులను కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన వాటిని ఉపసంహరించుకుంటామని స్పష్టం చేసింది. ఇలాఉండగా, సిట్టింగ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులపై కేసులు అలాగే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
కొవిడ్ ప్రోటోకాల్, లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వ్యాపారులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు సామాన్య ప్రజలందరికి ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు మినహా చార్జిషీట్లు దాఖలైన కేసులన్నింటినీ ఉపసంహరించుకోనున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఇరాన్ గ్యాస్ స్టేషన్పై సైబర్ దాడి.. నిలిచిన ఇంధన విక్రయ కేంద్రాలు?!
టీ20 టైటిల్ దక్కించుకోవడంలో భారత్ ఇప్పటికీ పోటీదారే : బ్రెట్లీ
పాకిస్తాన్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ : 11 మంది మృతి
ఇది లైవ్ బ్యాక్టీరియా క్లియర్ ఫొటో.. వెల్లడించిన యూకే శాస్త్రవేత్తలు
బందీపొరాలో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాద దాడి
జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లు ప్రారంభం
సూడాన్లో సైనిక తిరుగుబాటు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఏడుగురు మృతి
మీ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగించకండి: సోనియాగాంధీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..