సంతోషకర రాష్ర్టాల జాబితాలో ఆఖరి స్థానం.. సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: యోగి పాలనలో రామరాజ్యంగా మారిందని బీజేపీ గొప్పలు చెప్పుకొంటున్న ఉత్తరప్రదేశ్లో ప్రజలు అస్సలు సంతోషంగా లేరు. దేశంలోని మిగతా రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే యూపీ ప్రజలు ఎక్కువగా బాధల్లో ఉన్నారు. హెచ్ఆర్ ఫర్మ్, హ్యాపీప్లస్ కన్సల్టింగ్ సంస్థలు సంయుక్తంగా సర్వే చేసి ఈ విషయాన్ని వెల్లడించాయి.
వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు కోసం ఐరాస ఏ అంశాలను పరిగణనలోకి తీసుకొంటుందో ఈ సంస్థలు కూడా ఆ అంశాల ఆధారంగానే సర్వేను నిర్వహించాయి. ఒక్కో రాష్ట్రంలో 21వేల మందిని ప్రశ్నించి వారి సమాధానాల ఆధారంగా నివేదికను రూపొందించి విడుదల చేశాయి. ఈ సర్వే ప్రకారం.. దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం హిమాచల్ప్రదేశ్. తర్వాతి స్థానంలో పంజాబ్ ఉంది. ప్రజలు సంతోషంగా లేని రాష్ర్టాల జాబితాలో యూపీ, జమ్ముకశ్మీర్, లక్షదీవులు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు ప్రకారం భారత్ 146 దేశాల్లో 136వ స్థానంలో ఉంది.