జమ్ముకశ్మీర్ వేర్పాటువాది, నిషేధిత జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) నేత యాసిన్ మాలిక్కు యావజ్జీవ శిక్ష విధిస్తూ ఢిల్లీ పటియాలా కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. యాసిన్కు తిహార్ జైలు అధికారులు ప్రత్యేకంగా ఓ సెల్ను కేటాయించారు. ఆ సెల్కు భారీ భద్రత కల్పించారు. ఈ విషయాన్ని తిహార్ జైలు అధికారులు ప్రకటించారు. భద్రతా పరమైన విషయాలను దృష్టిలో పెట్టుకునే.. ఇలా ఏర్పాట్లు చేశామని జైలు అధికారులు పేర్కొంటున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా మాలిక్కు ఎలాంటి పనులు కూడా అప్పగించడం లేదు. ఆయన్ను ప్రత్యేక సెల్లో వుంచుతున్నాం. ఏడుగురు ప్రత్యేక బందోబస్తుగా వుంటారు. ఆ భద్రతను ప్రతిరోజూ పర్యవేక్షిస్తాం. రివ్యూ కూడా చేసుకుంటాం అని జైలు అధికారులు పేర్కొన్నారు. టెర్రర్ నిధులను సమకూర్చడంలో దోషిగా తేలాడు కాబట్టి, మాలిక్కు ఎలాంటి పెరోల్ కూడా వుండదన్నారు.
జమ్ముకశ్మీర్ వేర్పాటువాది, నిషేధిత జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) నేత యాసిన్ మాలిక్కు యావజ్జీవ శిక్ష విధిస్తూ ఢిల్లీ పటియాలా కోర్టు తీర్పునిచ్చింది. కేవలం యావజ్జీవ శిక్ష మాత్రమే కాదు.. 10 లక్షల రూపాయల జరిమానా కూడా కోర్టు విధించింది. ”రెండు జీవిత ఖైదులతో పాటు.. 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. వీటితో పాటు 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు” అని న్యాయవాది ఉమేశ్ శర్మ ప్రకటించారు.