PM Modi | ప్రముఖ భరతనాట్యం కళాకారిణి యామిని కృష్ణమూర్తి శనివారం కన్నుమూశారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్తను మేనేజర్, సెక్రటరీ గణేశ్ ధ్రువీకరించారు. ఆమె మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్పందించారు. యామినీ కృష్ణమూర్తి తుదిశ్వాస విడిచారన్న వార్త తెలిసి తను ఎంతో బాధపడ్డానని పేర్కొన్నారు. భారత శాస్త్రీయ నృత్యంలో ఆమె ప్రావీణ్యం, కళపై ఆమెకున్న అంకితభావం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. దేశ సాంస్కృతిక యవనికపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆమె మన వారసత్వాన్ని సుసంపన్నం చేసేందుకు ఎంతో కృషి చేశారంటూ ప్రశంసించారు. ఆమె కుటుంబానికి, అభిమానులకు సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.
Pained by the passing away of Dr. Yamini Krishnamurthy. Her excellence and dedication to Indian classical dance have inspired generations and left an indelible mark on our cultural landscape. She has worked greatly to enrich our heritage. Condolences to her family and admirers.…
— Narendra Modi (@narendramodi) August 4, 2024