న్యూఢిల్లీ, డిసెంబర్ 12: కేంద్ర పాలిత ప్రాంతాలైన(యూటీ) పుదుచ్చేరి, జమ్ము కశ్మీర్ శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం(రెండో సవరణ), కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వం(సవరణ) బిల్లులకు మంగళవారం లోక్సభ ఆమోదం తెలిపింది. ఇందుకోసం జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2019, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ చట్టం-1963కి సవరణలు చేశారు. ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కొనసాగింపుగా ఈ రెండు బిల్లులను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది.