Madhya Pradesh | కుమారుడి అరెస్ట్ ను అడ్డుకునేందుకు ఓ మహిళ పోలీసు కారు బ్యానెట్ పైకి ఎక్కేసింది. అనంతరం ఆ కారు అలాగే అరకిలోమీటరు దూరం వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నార్సింగ్ పూర్ (Narsinghpur)లో గల గోటేగాన్ (Gotegaon) ప్రాంతంలో డ్రగ్స్ వ్యాపారం (drug peddler)నిర్వహిస్తున్నట్లు పోలీసుల (Police) కు సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు చేయగా ముగ్గురు దొరికారు. వారిని పట్టుకుని స్టేషన్ కు తరలించబోయారు. నిందితుల్లో ఓ యువకుడి తల్లి అక్కడ పూలు అమ్ముకుంటూ తన కుమారుడిని పోలీసులు తీసుకెళ్తుండటాన్ని గమనించింది. దీంతో వారిని అడ్డుకునేందుకు ఏకంగా పోలీసు వాహనం బ్యానెట్ ఎక్కేసింది.
అయితే, పోలీసులు మాత్రం వాహనాన్ని ఆపకుండా అలాగే 500 మీటర్ల దూరంలోని స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ ఘటననంతా అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పోలీసుల తీరును తప్పుబడుతూ కామెంట్స్ చేశారు. దీంతో ముగ్గురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఘటనపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించారు.
Also Read..
Afghanistan | ఆఫ్ఘాన్ లో కొనసాగుతున్న అణచివేత.. మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధం
Niharika Konidela | విడాకులను ప్రకటించిన నిహారిక-చైతన్య.. సోషల్ మీడియాలో పోస్ట్
Kerala Heavy rains | కేరళలో భారీ వర్షం.. పాఠశాలలు మూసివేత.. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్