Niharika Konidela | నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల (Niharika Konidela) విడాకుల వ్యవహారం గురించి గత కొంతకాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. భర్త చైతన్య జొన్నలగడ్డ (Chaitanya)తో ఆమెకు మనస్పర్థలు తలెత్తాయని, కొన్నాళ్లుగా దంపతులిద్దరూ విడిగా ఉంటున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలను ధృవపరుస్తూ మంగళవారం కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది కూడా. కాగా, ఈ విషయంపై తాజాగా నిహారిక (Niharika) స్పందించారు. పరస్పర అంగీకారంతో తామిద్దరం విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు.
‘నేను, చైతన్య పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇక నుంచి ఎవరి జీవితాల్లా వాళ్లం ముందుకెళ్లాలనుకుంటున్నాం. ఈ సున్నిత సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇకపై మేమిద్దరం కొత్తగా ప్రారంభించబోయే వ్యక్తిగత జీవితం విషయంలో ప్రైవసీ ఇవ్వాలని అందరినీ కోరుతున్నాం. ఇప్పటి వరకూ నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు థ్యాంక్స్. నన్ను అర్థం చేసుకున్నందకు అందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. మరోవైపు చైతన్య సైతం ఇదే ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
2020 డిసెంబర్లో నిహారిక, చైతన్య జొన్నలగడ్డ వివాహం జరిగింది. సంవత్సరం పాటు ఈ దంపతుల బంధం సవ్యంగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడివిడిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం సోషల్మీడియా ఖాతాల నుంచి తాము కలిసి దిగిన ఫోటోలను వీరిరువురూ తొలగించారు. దీంతో ఈ జంట విడిపోతోందంటూ ప్రచారం జరిగింది. పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న నిహారిక ఇటీవలే ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో విడాకుల వార్తలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది.
Also Read..
Kerala Heavy rains | కేరళలో భారీ వర్షం.. పాఠశాలలు మూసివేత.. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
Afghanistan | ఆఫ్ఘాన్ లో కొనసాగుతున్న అణచివేత.. మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధం
Samantha | సామ్ షాకింగ్ నిర్ణయం.. సినిమాలకు లాంగ్ బ్రేక్..!