లక్నో: కుటుంబ తగాదాలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. భర్త రోజూ గొడవపడుతుండటంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ తన 9 నెలల కొడుకుతో కలిసి రన్నింగ్ ట్రైన్ ముందు దూకింది. ఈ ఘటనలో తల్లీకొడుకు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లాలోని హరిహర్గంజ్ పట్టణ సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హరిహర్గంజ్కు చెందిన ఉమేశ్ కుమార్ పటేల్, అర్చనా పటేల్ ఇద్దరూ భార్యాభర్తలు. ఉమేశ్ కుమార్ కాన్స్పూర్ రైల్వేస్టేషన్లో జూనియర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అర్చనా పటేల్ గృహిణి. అయితే, ఈ మధ్య ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దాంతో మనస్తాపానికి గురైన అర్చన ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. కాగా, ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు.