రాంచీ: సాధారణంగా ఒకే కాన్పులు కవలలు జన్మిస్తుంటారు. కొన్నిసందర్భాల్లో ఇద్దరికంటే ఎక్కువ మంది శిశువులు జన్మిస్తుంటారు. వారిలో ఒకరో ఇద్దరో ఆరోగ్యంగా ఉండి.. మిగిలినవారు వీక్గా ఉంటుంటారు. అయితే ఓ మహిళ ఒకేసారి ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అంతా ఆడపిల్లలే. తల్లితోపాటు పిల్లలూ క్షేమంగా ఉన్నారు. అయితే ఆ నవజాత శిశువులు బరువు తక్కువగా ఉండటంతో ఎన్ఐసీయూ (NICU) ఉంచారు. ఈ ఘటన జార్ఖండ్లోని (Jharkhand) రాంచీలో (Ranchi) ఉన్న రిమ్స్ (RIMS) దవాఖానలో జరిగింది.
జార్ఖండ్లోని చాటర్కు చెందిన అనితా కుమారి (27) అనే మహిళ రిమ్స్లోని ప్రసూతి, గైనకాలజీ విభాగంలో ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. పిల్లలు 750 గ్రాముల నుంచి 1.1 కిలోల వరకు బరువున్నారని, వారిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో ఉంచామన్నారు. ఒకే ప్రసవంలో ఐదుగురు పిల్లలు జన్మించడం అత్యంత అరుదుగా జరుగుతుందని, డాక్టర్ శశిబాలా సింగ్ (Dr. Shashi Bala Singh) డెలివరీ చేసినట్లు ట్విట్టర్ వైద్యులు వేదికగా వెల్లడించారు. రిమ్స్ చరిత్రలో ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలు జన్మించడం ఇదే తొలిసారి అని ఆసుపత్రి అధికారులు తెలిపారు. తల్లీ పిల్లలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు.
रिम्स के महिला एवं प्रसूति विभाग में इटखोरी चतरा की एक महिला ने पांच बच्चों को जन्म दिया है। बच्चें NICU में डाक्टरों की देखरेख में हैं। डॉ शशि बाला सिंह के नेतृत्व में सफल प्रसव कराया गया। @HLTH_JHARKHAND pic.twitter.com/fdxUBYoPoP
— RIMS Ranchi (@ranchi_rims) May 22, 2023