ముంబై : దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మండుతున్న వేళ ఓ మహిళ రిక్షా వాలాలు, వీధి వ్యాపారులకు ఉచితంగా టవల్స్ పంపిణీ చేసిన వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను ట్విట్టర్లో ఖుషీ పాండే షేర్ చేశారు. ఉష్ణోగ్రతలు రాబోయే రోజుల్లో పెరుగుతాయని ఐఎండీ వార్నింగ్ నేపధ్యంలో రోజంతా కష్టపడి పనిచేసే రిక్షా వాలాలు, వీధి వ్యాపారులకు ఉచితంగా టవల్స్ పంపిణీ చేశాము..వారికి కొద్దిపాటి ఆసరా అందించాలన్నదే మా ఉద్దేశమని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
As the Indian Meteorological Department (IMD) issues a heatwave warning, so we have distributed “Gamcha” to rickshaw pullers, Street Vendors who are working hard throughout the day. Our only endeavor is to make things a tad bit comfortable for them. 🥹 pic.twitter.com/O9JjGZXL3A
— Khushi Pandey (@KhushiPand46589) May 24, 2023
ఈ వీడియోకు ఇప్పటివరకూ 5.3 లక్షలకు పైగా వ్యూస్ రాగా, 14,000కుపైగా లైక్స్ వచ్చాయి. ఖుషీ దయార్ధ్ర హృదయాన్ని పలువురు ప్రశంసించారు. మీరు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు వెల్డన్ అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, మనం చేసే చిన్న సాయమే కష్టించి పనిచేసే పేదలకు ఆలంబన అవుతాయని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More
Ashish Vidyarthi | 60 ఏండ్ల వయసులో ఆశీష్ విద్యార్థి రెండో పెళ్లి .. వధువు బ్యాక్గ్రౌండ్ ఇదే !