న్యూఢిల్లీ: ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే బీజేపీని సులువుగా ఓడించవచ్చని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి చేసిన వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ( KC Venugopal ) స్పందించారు. దేశ రాజకీయాల వాస్తవ స్థితిగతులేమిటో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండానే కేంద్రంలో బీజేపీని ఓడించగలమని ఎవరైనా అనుకుంటే అది ఒట్టి కలగానే మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీని ఓడించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.
ప్రస్తుతం ముంబైలో ఉన్న మమతాబెనర్జి ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ శరద్ పవార్తో కలిసి సివిల్ సొసైటీ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయాల గురించి మాట్లాడిన మమత.. అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్కటైతే బీజేపీని ఓడించడం చాలా సులువు అవుతుందని వ్యాఖ్యానించారు.