న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకూ నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. ఉభయసభలూ దాదాపు 20 సెషన్స్ భేటీ అవనుండగా క్రిస్మస్కు ముందు సమావేశాలు ముగుస్తాయి. యూపీ, పంజాబ్ సహా కీలక అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ సమావేశాలు జరగనున్నాయి. ఇక కరోనా కారణంగా గత ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగలేదు. ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.