న్యూఢిల్లీ : నెలరోజుల పాటు సాగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29 నుంచి ప్రారంభమవుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పార్లమెంట్ సమావేశాలు క్రిస్మస్కు ముందు ముగుస్తాయి. కరోనా వైరస్ వ్యాప్తితో గత ఏడాది శీతాకాల సమావేశాలతో పాటు బడ్జెట్, వర్షాకాల సమావేశాలకు బ్రేక్ పడింది.
ఇక నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23న ముగుస్తాయని సమాచారం. లోక్సభ, రాజ్యసభ సభ్యులు సమావేశాలకు హాజరయ్యే క్రమంలో భౌతిక దూరం పాటించడం, మాస్క్లు ధరించడం వంటి నిబంధనలను విధిగా అమలు చేయనున్నారు. యూపీ సహా అయిదు కీలక రాష్ట్రాల్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యత నెలకొంది.