న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. దేశ రాజధానిలో (New Delhi) వరుసగా ఐదు రోజులపాటు వైన్ షాపులు (Wine Shops) మూతపడనున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami), జీ20 సమావేశాల (G20 summit) సందర్భంగా ప్రభుత్వ సెలవులు ప్రకటించింది. దీంతో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు వైన్ షాపులు (Liquor stores) బందవనున్నాయి. హస్తినలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 10 వరకు పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఆ మూడు రోజులు మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులతోపాటు మద్యం దుకాణాలు కూడా మూతపడనున్నాయి.
ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నెల 6, 7 తేదీల్లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశించింది. దీంతో వరుసగా ఐదు రోజులపాటు వైన్ షాపులు క్లోజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో వరుస సెలవుల కారణంగా మద్యం దుకాణాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. గత వారం రోజులుగా రాజధానిలో మద్యం అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోవడం విశేషం.